వంశాచారం 32
naa telugu kathalu వంశాచారం 32 అది ఒక పాడు పడిన పురాతనమైన మండపం లా ఉంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాల కి పూర్వం అక్కడ ఊర్వశి అనే ఒక రాణి ఆత్మ త్యాగం చేసిందని ఆమె ఆత్మ అక్కడ తిరుగుతుంటుంది అని కథలుప్రచారం లో ఉన్నందున సాధారణం గా అటు వైపుకి ఎవ్వరును వచ్చేందుకు సాహసించరు .
సరిగ్గా అదే మండపంలోకి మత్తు ఇచ్చి తీసుకురాబడిన ఆ ఇద్దరు మహిళలు ఘాటైన వాసన ముక్కుకి తగులుతుంటే అతి కష్టం మీద కళ్ళు మెల్లగా తెరచి తాము ఎక్కడ వున్నామో గమనించ సాగారు. తమ పక్కనే ఇద్దరు నవ యువకుల్ని కట్టివేసి మోకాళ్ళ మీద నిలబెట్టి ఉండటాన్ని గమనించారు. వాళ్ళని చూస్తే బాగా దెబ్బలు తిన్న వాళ్ళ లా గాయాలతో మూలుగుతూ ,నొప్పికి చిన్నగా ఏడుస్తూ వున్నారు.
చింపిరి జుట్టు తో లావుగా భయంకరం గా వున్న ఒక మధ్య వయస్సు వాడు.. తన చేతిలోని పొగ ని తమకు చూపిస్తూ నవ్వుతూ ఎదురుగా నిలుచున్న ఇంకో నల్ల గా వున్న యువకుడితో ఏదో మాట్లాడుతున్నాడు.
ఒరేయ్.. అల్లుడూ నాకు మహా ఆనందంగా